తెలంగాణ

telangana

Deers skeletons: కలకలం సృష్టిస్తున్న జింకల కళేబరాలు... ఎక్కడంటే

By

Published : Mar 6, 2022, 5:30 PM IST

Deers skeletons in kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Deers skeleton
జింక కళేబరాలు

Deers skeletons in kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో జింకల కళేబరాలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చి చంపారు. ఆదోని మండలం నారాయణపురం వద్ద ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆదోని సరిహద్దు చెక్​పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితులు కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి :Grand father-son dead: నీటిలో మునిగిన మనువడు.. రక్షించబోయి తాత

ABOUT THE AUTHOR

...view details