Two died in hasanparthi : ఈత సరదా రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఇద్దరు మిత్రులు మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మునిపల్లి శివారులోని ఓ కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.
Two died in hasanparthi : నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. ఈతకు దిగిన ఇద్దరు మిత్రులు మృతి - ఈతకు వెళ్లిన ఇద్దరు మిత్రులు మృతి
Two died in hasanparthi: నూతన సంవత్సరం వేడుకలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈతకు వెళ్లిన ఇద్దరు మిత్రులు తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చి వెళ్లిపోయారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది.
![Two died in hasanparthi : నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. ఈతకు దిగిన ఇద్దరు మిత్రులు మృతి two dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14071781-1046-14071781-1641074906591.jpg)
కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా అయిదుగురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. అనంతరం ధర్మసాగర్ మండలం రపకపల్లెకు చెందిన వాసుకుల ఆకాశ్, భూపాల పల్లి మండలం చెల్పూర్కు చెందిన శ్రీకర్... కుంటలో ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మిగిలిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాను వెలికితీసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:New Year Road accidents: ప్రమాదాలతో ప్రారంభమైన న్యూఇయర్.. ఓ ఎస్సై సహా 12 మంది మృతి