తెలంగాణ

telangana

By

Published : May 17, 2022, 10:34 PM IST

ETV Bharat / crime

గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడని.. విద్యార్థిపై కత్తులతో దాడి

Attempt to Murder on Student : తన గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడనే అక్కసుతో పదో తరగతి విద్యార్థి తన స్నేహితుడితో కలిసి మరో విద్యార్థిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది.

Attempt to Murder on Student
Attempt to Murder on Student

Attempt to Murder on Student : 10వ తరగతి విద్యార్థులపై తోటి స్నేహితులు కత్తులతో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో జరిగింది. తన ప్రియురాలికి దుర్గాప్రసాద్‌ హాయ్‌ చెప్పాడనే అక్కసుతో నిందితులు దాడి చేశారు. దుర్గాప్రసాద్‌తో కలిసి ఫిలింనగర్‌లో పార్టీ చేసుకున్న ఇద్దరు స్నేహితులు మాయమాటలు చెప్పి అతణ్ని అత్తాపూర్‌లోని మూసీ వద్దకు తీసుకెళ్లారు.. అక్కడ ఒక్కసారిగా కత్తులతో దాడి చేయడంతో ప్రసాద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడు అరుపులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. 307 సెక్షన్ కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details