ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident: ఎగ్జామ్ రాసి తిరిగి వస్తుండగా... - Telangana news

ఎగ్జామ్ రాయడానికి వెళ్లి రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన నార్సింగి పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident
Road Accident
author img

By

Published : Aug 12, 2021, 10:05 PM IST

హైదరాబాద్​ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు ఘటనా స్థలంలో మృతి చెందారు. మృతులు కౌశిక్, జోడెన్​గా గుర్తించారు. గండిపేట సీబీఐటీ రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం చెందగా... మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

గండిపేట నుంచి నార్సింగి వైపు వెళ్తుండగా... ఆటోను తప్పించబోయి కారు కరెంటు స్తంభానికి ఢీకొట్టింది. విద్యార్థులంతా గండిపేట సీబీఐటీ కాలేజీలో ఓ విద్యార్థికి ఎగ్జామ్ ఉన్నందువల్ల కాలేజీ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదానికి గురైందని క్షతగాత్రులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details