ఏపీలోని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తిమ్మనాయునిపేట వద్ద గోవింద్ అనే వ్యక్తి ట్రాక్టర్ పంక్చర్ అయ్యింది. రోడ్డు పక్కకు వాహనం నిలిపి బాగుచేస్తున్నాడు. బి.ఉప్పులూరుకు చెందిన రవి.. ద్విచక్రవాహనంపై వచ్చి గోవింద్ను బలంగా ఢీకొట్టాడు.
ఆగివున్న ట్రాక్టర్ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి
అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగింది. ట్రాక్టర్ను రోడ్డు పక్కన నిలిపి ఓ వ్యక్తి బాగుచేస్తున్నాడు. అంతలో ఓ ద్విచక్రవాహనం అతివేగంగా వచ్చి ఆగిఉన్న ట్రాక్టర్ని, దాన్ని బాగుచేస్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ట్రాక్టర్ రిపేర్ చేస్తున్న వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
ఆగివున్న ట్రాక్టర్ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
అదుపుతప్పిన ద్విచక్రవాహనం ఆగివున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన గోవింద్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.