ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని నెల్లూరు వైద్యశాలకు తరలించారు.
నెల్లూరు హరినాథపురానికి చెందిన ఓ కుటుంబం.. ఐదో తరగతి చదివే తమ కుమారుడిని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న హాస్టల్లో చేర్పించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోవూరు ఏసీసీ కల్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనతో కారులో ఉన్న విద్యార్ధి తాత, పార్లపల్లి సుధాకర్రావు(76), అమ్మ అపర్ణ(30) అక్కడికక్కడే మృతిచెందారు.