భూపాలపల్లిలో ఇద్దరు సింగరేణి కార్మికులకు గాయాలయ్యాయి. కేటీకే-1వ గనిలో మొదటి షిప్టులో రెండు ప్రమాదాలు జరిగాయి. ఆరుగురు కార్మికులు డ్రిల్స్ మార్చుతుండగా సిమెంట్ పెల్లలు ఊడిపడ్డాయి. ఐదుగురు కార్మికులు తప్పించుకోగా.. జనరల్ మద్దూర్ కార్మికుడు సలీంకు తీవ్రగాయాలయ్యాయి.
Coal Mine Accident: సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు - భూపాలపల్లి జిల్లా వార్తలు
భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-1వ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురు కార్మికులు డ్రిల్స్ మార్చుతుండగా సిమెంట్ పెల్లలు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో కోల్ కట్టర్ కార్మికుడికి యంత్రం తగలడంతో కాలు విరిగింది.
![Coal Mine Accident: సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు Coal Mine Accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13930769-564-13930769-1639720505335.jpg)
Coal Mine Accident
మరో ఘటనలో మల్లయ్య అనే కోల్ కట్టర్ కార్మికుడికి యంత్రం తగలడంతో గాయపడ్డాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాద ఘటనను సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి:Inter Student Suicide : తక్కువ మార్కులొచ్చాయని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య