Vikarabad Accident: వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చి.. - road accidents today
Vikarabad Accident: ఇంకో ఐదు నిమిషాల్లో పొలం నుంచి ఇంటికి చేరుకుంటారనగా.. లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి సమీపంలో లారీ ఢీకొట్టి ఇద్దరు దుర్మరణం చెందారు.
![ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చి.. vikarabad accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14320638-737-14320638-1643524198942.jpg)
తొండపల్లికి చెందిన కావలి సుభాన్, గుర్రంపల్లి రాజులు పొలం నుంచి ఇంటికి వస్తుండగా.. షాద్నగర్ నుంచి వస్తున్న లారీ వారి బైక్ను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఇంకో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీచూడండి:Karimnagar Car Accident : గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం