హైదరాబాద్ ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది. కంటైనర్కు మంటలు అంటుకొని ఇద్దరు సజీవదహనం అయ్యారు. రాజస్థాన్కు చెందిన సెహ్జద్, బిహార్ వాసి గంగసాగర్ గుజరాత్ నుంచి కార్ల లోడుతో కంటైనర్ తీసుకొని బయలుదేరారు.
కంటైనర్లో మంటలు.. ఇద్దరు సజీవదహనం - ఉప్పల్ వార్తలు
విద్యుత్తీగలు కంటైనర్కు తగలి... ఇద్దరు సజీవదహనమైన ఘటన ఉప్పల్లో చోటు చేసుకుంది. మృతులు రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![కంటైనర్లో మంటలు.. ఇద్దరు సజీవదహనం two-drivers-burned-alive-in-container-caught-fire-at-uppal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11646913-thumbnail-3x2-dead.jpg)
కంటైనర్లో మంటలు.. ఇద్దరు సజీవదహనం
కంటైనర్లో మంటలు
తెల్లవారుజామున ఉప్పల్ పారిశ్రామిక వాడకు చేరుకున్న వీరు... అక్కడ మోడ్రన్ బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కన కంటైనర్ నిలిపి నిద్రపోయారు. ఈ క్రమంలో కంటైనర్పై ఉన్న విద్యుత్ తీగలు తగిలి... మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. కంటైనర్లోని కొన్ని కార్లు కాలిపోగా.. మరికొన్ని దెబ్బతిన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : May 5, 2021, 12:34 PM IST