మేడ్చల్ జిల్లాలో.. బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 టీకాలు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్లో రెమ్డెసివిర్ను విక్రయిస్తోన్న ఇద్దరు అరెస్ట్ - బ్లాక్లో కరోనా టీకా
ఆపత్కాలంలో ప్రజల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు.. ఇద్దరు అక్రమార్కులు చీకటి వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. బ్లాక్లో.. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పట్టణంలో ఇది జరిగింది.
arrest
నిందితులు.. సంకీర్త్, నెమలి కుమార్లు రూ.15 వేలకు రెమ్డెసివిర్ను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం.. వారిని రిమాండ్కు తరలించారు. బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Geethanjali: డేటింగ్ యాప్లో నటి గీతాంజలి ఫొటోలు.. పోలీసులకు ఫిర్యాదు