బొగ్గులోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు సమీపంలో జరిగింది. ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది.
నడిరోడ్డుపై దగ్ధమైన బొగ్గులారీ - రంగారెడ్డి జిల్లాలో బొగ్గు లారీలో అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు సమీపంలో ఓ బొగ్గు లారీ అగ్నికి ఆహుతైంది. బొగ్గు లోడుతో వెళ్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
నడిరోడ్డుపై దగ్ధమైన బొగ్గులారీ
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల నుంచి లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.