తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆర్థిక ఇబ్బందులతో ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్య!

కరోనా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురిని కబళిస్తోంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. తద్వారా అప్పుల భారం పెరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రమోద్ రెడ్డి.. ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు భార్య దుర్గాదేవి తెలిపింది.

By

Published : May 6, 2021, 2:36 PM IST

Traffic police suicide, nizamabad
Traffic police suicide, nizamabad

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో ట్రాఫిక్ పోలీస్ ప్రమోద్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ రెడ్డి(33) నగరంలోని వెంకటేశ్వర కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.

ఆరేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడని.. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు భార్య దుర్గాదేవి తెలిపింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు.

20 రోజుల క్రితం ప్రమోద్ రెడ్డి తల్లి సుజాతకు కరోన పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం కొవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పుల భారం అధికమవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురైనట్లు భార్య పేర్కొన్నారు. మృతునికి కుమార్తెలు నిఖిత, తన్మత రెడ్డి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:ఏనుగుల దాడిలో పంట ధ్వంసం, మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details