Crime News: ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు అరెస్టయ్యారు. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడిని ప్రకాశం జిల్లా తాడివారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. తర్లుపాడు మండలం నాగేళ్లముడిపి గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమపేరుతో వంచించి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆరో నెల గర్భవతని తెలిపారు. గర్భం తొలగించేందుకు బాలికను అక్కడి నుంచి ఒంగోలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరాతీశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి వెల్లడించారు.
జింక మాంసాన్ని వండుతుండగా..
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం విరుపాపల్లిలో ఓబులయ్య అనే వ్యక్తి నుంచి పోలీసులు జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 కిలోల మాంసాన్ని వండుతుండగా... రెండ్ హ్యాండెడ్గా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఓబులయ్యను అదుపులోకి తీసుకొని కల్యాణదుర్గం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అతనిపై కేసు నమోదు చేశారు.
నకిలీ బంగారం విక్రయించి ... 15 లక్షల నగదుతో...
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో ఈనెల 22న నకిలీ బంగారం విక్రయించి ... రూ. 15 లక్షల నగదుతో ఉడాయించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో సిరిసిల్ల జిల్లా లింగంపేటకు చెందిన సుధీర్.. ఐదుగురు ముఠా సభ్యులతో కలిసి రూ. 15 లక్షలతో డబ్బుతో ఉడాయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. గోరంట్ల సమీపంలోని తమ్మినాయన పల్లి క్రాస్ వద్ద ఆదివారం ఉదయం వెంకటేష్, నరేశ్, ఐజాం, శ్రీకృష్ణలను అరెస్ట్ చేయగా.. మొదటి ముద్దాయి నవీన్ పరారీలో ఉన్నారని సీఐ జయ జయ నాయక్ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని యువకుడిని మోసగించిన ముఠా...