తెలంగాణ

telangana

700 కిలోమీటటర్లు.. 800 సీసీ కెమెరాలు.. కిడ్నాప్​ కథ సుఖాంతం

హైదరాబాద్​లోని అబిడ్స్​లో కిడ్నాప్​కు గురైన బాలుడి​ కేసును​ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏకంగా 800 సీసీ కెమెరాల ఫుటేజ్​ను పరిశీలించారు. చివరికి మహారాష్ట్రలోని మాలేగావ్​లో కిడ్నాపర్​ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతమైంది.

By

Published : Feb 22, 2021, 8:40 PM IST

Published : Feb 22, 2021, 8:40 PM IST

three years old boy kidnap case solved by abids police today and kidnaper arrest in maharashtra
బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన అబిడ్స్​ పోలీసులు

హైదరాబాద్‌ అబిడ్స్‌లో జరిగిన మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు ఛేదనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కిడ్నాపైన బాలుణ్ని ఈనెల 19న శుక్రవారం పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది.

బాలుడి ఆచూకీ కోసం సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించిన రాష్ట్ర పోలీసులు మహారాష్ట్రలోని మాలేగావ్‌లో కిడ్నాపర్​ను అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్‌ నుంచి మాలేగావ్‌ వరకు 800కుపైగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ కేసులో పోలీసులు చూపిన చొరవను కచ్చితంగా అభినందించాల్సిందే.

బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన అబిడ్స్​ పోలీసులు

ఇదీ చూడండి :హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ

ABOUT THE AUTHOR

...view details