తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2021, 8:17 PM IST

Updated : Aug 27, 2021, 10:57 PM IST

ETV Bharat / crime

ROAD ACCIDENT: పుట్టిన రోజునే విషాదం.. కేక్​ కోసం వెళ్లిన ముగ్గురు మృతి

ROAD ACCIDENT: పుట్టిన రోజునే విషాదం.. కేక్​ కోసం వెళ్లిన ముగ్గురు మృతి
ROAD ACCIDENT: పుట్టిన రోజునే విషాదం.. కేక్​ కోసం వెళ్లిన ముగ్గురు మృతి

20:15 August 27

గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పుట్టినరోజు వేడుకల కోసం కేక్‌ కొనుక్కుని వెళ్తుండగా వారి ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.ఈప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. 

మృతుల్లో ఒకరైన జయవర్ధన్‌ది ఇవాళ పుట్టినరోజు. ఈ ప్రమాదంలో జయవర్ధన్‌ స్నేహితులు విష్ణు‌, వరప్రసాద్‌లు మృతి చెందారు. మృతులంతా 18 ఏళ్ల లోపు వారే కావటంతో వారి కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన ముగ్గురు యువకులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఇదీ చదవండి:software employee suicide: పెళ్లికావడం లేదని సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

Last Updated : Aug 27, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details