ఏపీలోని విశాఖ జిల్లా మాకవరపాలెం సమీపంలోని పీపీ అగ్రహారం వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మాకవరపాలేనికి చెందిన ఆర్ హేమంత్ అనే విద్యార్థి.. తన ఇంట్లో జరిగే శుభకార్యానికి స్నేహితులు అనీష్, హర్షిత్తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు.
చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి - three students death at pp agraharam
తన ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థి.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొట్టాడు. ఏపీ విశాఖ జిల్లా మాకవరపాలెం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మణం చెందారు.
విశాఖలో చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం
మార్గమధ్యలో.. పీపీ అగ్రహారం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బైకు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో హేమంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనీష్, హర్షిత్ తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మాకవరపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి :గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని... స్టేట్ హోమ్కు తరలింపు