తెలంగాణ

telangana

ETV Bharat / crime

నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..! - atm theft cc camera visuals

ఖమ్మం జిల్లా మధిరలో అర్ధరాత్రి వేళ ఏటీఎం చోరీకి వచ్చిన ఇద్దరు దొంగలు చేసిన పని... నవ్వులు పూయిస్తోంది. అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే చేసినా... చివర్లో వారి అంచనా తప్పింది. ఆఖరికి తేలు కుట్టిన దొంగల్లా వారిద్దరూ అక్కడ్నుంచి జారుకున్న వైనం... పకాపకా నవ్విస్తోంది.

atm chori
atm chori

By

Published : Jun 16, 2021, 4:57 AM IST

Updated : Jun 16, 2021, 3:48 PM IST

ఖమ్మం జిల్లా మధిర బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద మాటూరు పేట గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ ఏటీఎం. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నంత పకడ్బందీ ప్రణాళికతో అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు... ఏటీఎంలోకి వచ్చారు. అందులో ఉన్న సీసీ కెమెరానే లక్ష్యంగా చేసుకుని ముందుగా దాన్ని బద్దలుకొట్టారు.

ఆ తర్వాత ఏటీఎం యంత్రాన్ని తెరిచేందుకు ఇద్దరు దొంగలు శాయశక్తులా ప్రయత్నించారు. వాళ్లిద్దరి వల్లా కాకపోవటం వల్ల విఫలయత్నమే అయ్యింది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా వేళ జాగ్రత్తగా మాస్కులు ధరించి చోరీకి వచ్చిన కేటుగాళ్లు... ఏటీఎంలో ఉన్న మరో సీసీ కెమెరాని మాత్రం గుర్తించలేకపోయారు. చోరీ చేసేందుకు వచ్చి.... వీరు చేసిన తతంగమంతా ఆ సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

కాసేపటికి రెండో సీసీ కెమెరాని గుర్తించిన కేటుగాళ్లు మెల్లిగా అక్కడ్నుంచి జారుకున్నారు. తెల్లవారిన తర్వాత విషయం గమనించిన ఏటీఎం నిర్వాహకులు... చోరీ విషయమై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

ఇదీ చూడండి: Gun firing: గన్​తో కాల్చేశాడు.. ఆపై తానూ కాల్చుకున్నాడు

Last Updated : Jun 16, 2021, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details