రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని శ్రీగణేశ్ జ్యువెల్లరీ దుకాణం(Theft in jewellery shop)లో భారీ దొంగతనం జరిగింది. దుకాణం గోడకు కన్నం చేసి దొంగలు లోనికి వెళ్లారు. బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లడానికి ప్రయత్నించారు. బంగారం లాకర్లో ఉండటం వల్ల దుండగులు ఎత్తుకెళ్లలేకపోయారు. కానీ.. సుమారు 5 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు.
Theft in jewellery shop : జ్యువెల్లరీ షాపులో దొంగతనం.. 5 కిలోల వెండి ఆభరణాలు మాయం - five kgs silver was theft
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని శ్రీగణేశ్ జ్యువెల్లరీ దుకాణం(Theft in jewellery shop)లో భారీ చోరీ జరిగింది. దుకాణం గోడకు కన్నం చేసిన దుండగులు.. దాని ద్వారా లోపలి చొచ్చుకుని వెళ్లి 5 కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.
![Theft in jewellery shop : జ్యువెల్లరీ షాపులో దొంగతనం.. 5 కిలోల వెండి ఆభరణాలు మాయం 5 కిలోల వెండి ఆభరణాలు మాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13124362-thumbnail-3x2-a.jpg)
5 కిలోల వెండి ఆభరణాలు మాయం
ఇవాళ ఉదయం దుకాణం(Theft in jewellery shop) తెరవడానికి వెళ్లిన యజమాని.. గోడకు కన్నం ఉండటం చూసి ఖంగుతిన్నాడు. వెంటనే షాపు తెరిచాడు. 5 కిలోల వెండి అభరణాలు లేకపోవడం చూసి దొంగలు పడ్డారని నిర్ధరణకు వచ్చాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగారు ఆభరణాలు లాకర్లో పెట్టడం వల్లే అవి వాళ్లు ఎత్తుకెళ్లలేకపోయారని యజమాని తెలిపారు.