నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో గల సురేష్ క్లాత్, విట్టల్ క్లాత్ వస్త్ర దుకాణాల్లో శుక్రవారం దొంగతనం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకే దుకాణాన్ని మూసివేసి వెళ్లిన యజమాని ఈరోజు ఉదయం వచ్చి చూసేసరికి షాపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా... వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి.
రెండు వస్త్ర దుకాణాల్లో దొంగల చేతివాటం.. 5 లక్షలు స్వాహా.. - నిజామాబాద్ తాజా క్రైమ్ వార్తలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వస్త్ర దుకాణాల్లో దొంగతనం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![రెండు వస్త్ర దుకాణాల్లో దొంగల చేతివాటం.. 5 లక్షలు స్వాహా.. theft at two cloth stores in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:29:45:1621655985-11841720-thief.jpg)
రెండు వస్త్ర దుకాణాల్లో దొంగల చేతివాటం
రెండు దుకాణాల్లోని లాకర్లలోంచి దాదాపు 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయంటూ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు