ఖమ్మం జిల్లా మధిర పురపాలికలోని దిడుగుపాడు గ్రామంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. రెవెన్యూ అధికారులు తనకు ధ్రువీకరణపత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. గ్రామానికి చెందిన రమేష్ ఇటీవల కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రోజుల తరబడి సర్టిఫికెట్ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్టవర్ ఎక్కాడు.
సెల్టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం - సెల్టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లా మధిర పురపాలిక పరిధిలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. రెవెన్యూ అధికారులు తనకు ధ్రువీకరణపత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సెల్టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రమేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడితో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.
సెల్టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
ఇదీ చదవండి:బెల్టుషాప్లో మర్డర్.. పాతకక్షలే కారణం..!