తెలంగాణ

telangana

ETV Bharat / crime

తనిఖీలు నిర్వహిస్తోన్న ఎస్సైని ఢీకొట్టిన ద్విచక్రవాహనం - తెలంగాణ ప్రమాద వార్తలు

అతిగా మద్యం సేవించిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ.. తనిఖీలు నిర్వహిస్తోన్న ఎస్సైనే ఢీ కొట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఊట్లపల్లి గ్రామంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన ఎస్సైని సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.

the-two-wheeler-that-collided-with-essay-conducting-inspections-in-bhadradri-kothagudem-district
తనిఖీలు నిర్వహిస్తోన్న ఎస్సైని ఢీకొట్టిన ద్విచక్రవాహనం

By

Published : Feb 14, 2021, 9:26 PM IST

Updated : Feb 14, 2021, 9:55 PM IST

ద్విచక్రవాహనంపై వేగంగా వెళుతోన్న ముగ్గురు యువకులు తనిఖీలు నిర్వహిస్తోన్న ఎస్సైని ఢీకొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై మధుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాములవారి గూడెం గ్రామానికి చెందిన భాను కిరణ్​ తన ఇద్దరు మిత్రులతో కలిసి వినాయకపురంలో మద్యం సేవించి స్వగ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో ఊట్లపల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా నడిపారు. ఆ క్రమంలో ఎదురుగా ఉన్న ఎస్సై మధుప్రసాద్ ఢీకొట్టారు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఎస్సైని సిబ్బంది అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు కాలు, చేయి విరిగినట్లు నిర్ధరించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి పంపించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:వారు దిల్లీలో గులాంగిరి చేస్తారు: హరీశ్​ రావు

Last Updated : Feb 14, 2021, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details