సూర్యాపే జిల్లాలోని పాలకీడు మండలంలో ఉన్న దర్గా మొక్కలు తీర్చుకోవడం కోసం.. గుంటూరుకు చెందిన ఓ కుటుంబం ట్రాక్టర్లో బయలుదేరారు. కాగా వీరు ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ మార్గమధ్యలో దామరచర్ల మండలం ఓ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు - అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు
ఈ ఘటనలో 20 మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన బాధితులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
- ఇదీ చూడండి :పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా