బీమాసురుల ఆగడాలు రోజుకొకటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. బీమా సొమ్ము కోసం మామను హత్య చేసిన అల్లుడితో పాటు అతనికి సహకరించిన మృతుడి కుమార్తెను, మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తవ్వేకొద్ది ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.!
నాగార్జునసాగర్ సీఐ గౌరునాయుడు కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండాకు చెందిన బిక్నానాయక్(45).. తన కుమార్తె బుజ్జిని దామరచర్ల మండలం పుట్టలతండాకు చెందిన భాష్యానాయక్కు ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత 2015 ఫిబ్రవరిలో బిక్నానాయక్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన కారణంగా మృతిచెందారని అప్పట్లో కేసు నమోదైంది. బీమా డబ్బుల కోసం హత్య కేసులు వెలుగుచూడడంతో పోలీసులు అనుమానం ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారు.