ఓ హెడ్కానిస్టేబుల్ మద్యం మత్తులో తుపాకీతో హల్చల్ చేశాడు.. శనివారం అర్ధరాత్రి వరంగల్ నగరంలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తుపాకీతో హెడ్కానిస్టేబుల్ హల్ చల్
పోలీస్ హెడ్కానిస్టేబుల్ తుపాకీతో హల్ చల్ చేసిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ గోపాలస్వామి ఆలయం వద్ద తుపాకీతో వచ్చే పోయే వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో హెడ్కానిస్టేబుల్ని స్టేషన్కు తలించి విచారణ చేపట్టారు.
అధిక మోతాదులో మద్యం తాగి తుపాకీని చేతితో పట్టుకుని హంగామా చేశాడు. వరంగల్ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ నిందితుడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఖైదీ భద్రత కోసం వరంగల్ పోలీసు కమిషనరేట్లోని ఏఆర్ విభాగానికి చెందిన హెడ్కానిస్టేబుల్ కేవీబీ ప్రసాద్ విధుల్లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఎంజీఎం రోడ్డు మార్గంలో తుపాకీతో వాహనదారులను భయాందోళనకు గురి చేశాడు. హెడ్కానిస్టేబుల్ కేవీబీ ప్రసాద్పై న్యూసెన్స్, ఆమ్స్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:'పాలన కొనసాగించే నైతిక హక్కును భాజపా కోల్పోయింది'