విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం.. రోజులాగే పొలానికి వెళ్లాడు. పంటకు నీరు అందించే క్రమంలో.. కరెంట్ షాక్కు గురై ప్రాణాలు విడిచాడు.
విషాదం: విద్యుదాఘాతంతో రైతు మృతి - కరెంట్ షాక్ తో రైతు మృతి
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఓ రైతు.. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
![విషాదం: విద్యుదాఘాతంతో రైతు మృతి farmer died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:42:01:1624198321-tg-srd-41-20-vidhyuth-shock-mruthi-img-ts10115-20062021190158-2006f-1624195918-489.jpg)
farmer died
ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా పడి ఉన్న రహీంని చూసి బోరున విలపించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
ఇదీ చదవండి:విషాదం: చెరువులో మునిగి తాతా మనుమడు మృతి