తెలంగాణ

telangana

ETV Bharat / crime

VIVEKA MURDER CASE: వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం - telangana news

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం గోవా స్థానిక కోర్టులో హాజరుపరిచి... సునీల్​ను సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్​లోకి తీసుకున్నారు.

VIVEKA MURDER CASE, SUNIL YADAV ARREST
వైఎస్‌ వివేకా హత్య కేసు, సునీల్ యాదవ్ అరెస్ట్

By

Published : Aug 3, 2021, 2:47 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం గోవాలో సునీల్ యాదవ్​ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. మంగళవారం ఉదయం గోవా స్థానిక కోర్టులో హజరుపరిచి... సునీల్​ను సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్​లోకి తీసుకున్నారు. సునీల్ యాదవ్​ను కడప కోర్టులో సీబీఐ అధికారులు బుధవారం హాజరుపర్చనున్నారు.

మరోవైపు 58వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి కడప జిల్లా పులివెందులలోని తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

గతంలో హైకోర్టును అశ్రయించిన సునీల్ యాదవ్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తమను సీబీఐ వేధిస్తోందని కడప జిల్లా మోతునూతలపల్లికి చెందిన యదాతి సునీల్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీబీఐ అధికారులు విచారణ కోసం దిల్లీకి పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అనుమతి లేకుండా లై డిటెక్టర్ వినియోగించారన్నారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు.

ఇదీ చదవండి: Suicide:భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details