తిరుమలలో భక్తులను మోసగించిన ఓ దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన భక్తులకు వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ.. శివకుమార్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ భక్తుల నుంచి 4,500 రూపాయల నగదును ఫోన్పే ద్వారా తీసుకున్నాడు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం - చిత్తూరు తాజా న్యూస్
తిరుమలలో మహారాష్ట్రకు చెందిన భక్తులకు.. వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ ఓ దళారీ మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
![తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10528163-511-10528163-1612627172420.jpg)
తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం
అనంతరం వారికి ఉచిత దర్శనం టోకెన్లు ఇచ్చి.. దర్శనానికి పంపించాడు. వీఐపీ బ్రేక్ టికెట్లు బదులు.. సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడంతో బాధితులు.. శివకుమార్పై తితిదే విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు. దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు.