తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2021, 11:24 AM IST

Updated : Oct 4, 2021, 3:19 PM IST

ETV Bharat / crime

Student suicide: ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Suicide:
ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

11:20 October 04

ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

పిల్లలపై మొబైల్స్​ ప్రభావం ఎంతగా పడింది అంటే.. అవి లేకుండా ఉండలేనంతగా. ఫోన్​లోని గేమ్స్​ మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. బంగారు లాంటి భవిష్యత్తును పక్కనపెట్టి... సెల్​ఫోన్స్​కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు మొదట్లో పట్టించుకోకుండా.. వారు పూర్తిగా మొబైల్స్​కి అలవాటు అయ్యాక స్పృహలోకి వస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతోంది.

హైదరాబాద్‌ మీర్‌పేట్ పరిధిలో ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫోన్‌లో ఆటలు ఆడొద్దన్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. మీర్​పేట్​ పరిధిలోని సర్వోదయనగర్​ కాలనీలో మనోహర చారి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. చారికి ముగ్గురు సంతానం. వారిలో మొదటి కుమార్తె కౌశికి(17) ఇంటర్​ చదవుతోంది. మొబైల్స్​లో గేమ్స్​ ఎక్కువగా ఆడుతోందని తండ్రి మందలించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... మార్గం మధ్యలోనే మృతి చెందింది. మీర్​పేట్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేపట్టారు. 

తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్స్​ ఇచ్చినా... ఆన్​లైన్​ క్లాస్​లు జరుగుతున్నా ఓ కంట కనిపెట్టడమే మంచిది. పూర్తిగా సెల్​ఫోన్స్​కి అలవాటుకాక ముందే... వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 

ఇదీ చూడండి:Hot mail cyber crime: హాట్‌ మెయిల్‌ మెసేజ్​తో ఎర.. రూ.25 లక్షలు హుష్​ కాకి

Farmers suicide: పంట దక్కక.. అప్పు తీర్చలేక.. ఇద్దరు రైతులు బలవన్మరణం

Last Updated : Oct 4, 2021, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details