తెలంగాణ

telangana

By

Published : May 7, 2021, 4:15 PM IST

ETV Bharat / crime

మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో 36రెమ్​డెసివిర్​​ ఇంజక్షన్లు స్వాధీనం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్​ కాలనీలోని ఓ ఆస్పత్రిపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 36 రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

remdesivir
remdesivir

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అక్రమంగా నిల్వ ఉంచిన రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్​ కాలనీలోని శ్రీ సూర్య జనరల్​ ఆస్పత్రిలో గురువారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 36 రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆస్పత్రిలోని మందుల దుకాణంతో పాటు... ల్యాబరేటరీలోను ఇంజక్షన్లు దాటినట్లు గుర్తించారు. కొవిడ్​ బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఒక్కో ఇంజక్షన్​ రూ.30 వేలకు పైగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుడు అశోక్​ కుమార్​, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ఆస్పత్రిని సీజ్​ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:నకిలీ ధ్రువపత్రాలతో కారు లోన్.. హెల్త్ ఇన్​స్పెక్టర్ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details