నకిలీ విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తోన్న ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని నాగారంలో ఇది జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న 13 కిలోల పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Fake seeds: నకిలీ విత్తనాల పట్టివేత.. ముగ్గురి అరెస్ట్ - నకిలీ విత్తనాల అమ్మకం నేరం
పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. నకిలీ విత్తనాలు చలామణి అవుతూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో నకిలీ విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 13 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
![Fake seeds: నకిలీ విత్తనాల పట్టివేత.. ముగ్గురి అరెస్ట్ Fake seeds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:40:23:1624183823-tg-krn-106-20-nakhilivitthanalupattivetha-av-ts10125-20062021153317-2006f-1624183397-895.jpg)
Fake seeds
నిందితుడు రవీందర్ రెడ్డి సమాచారంతో మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:మహిళ మృతదేహాన్ని బావిలో పడేశారు.. తిరిగి వస్తూ పోలీసులకు చిక్కారు!