STUDENT STUCK BETWEEN TRAIN UPDATE: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు-ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ(20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. యూరిన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం అవుతుండటంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృత్యువుతో పోరాడుతూ శశికళ ప్రాణాలు విడిచింది.
అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్లో ఆమె దువ్వాడ చేరుకుంది. స్టేషన్లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ప్లాట్ఫామ్ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల వద్ద ఉండిపోవడంతో తీవ్ర గాయాలతో గగ్గోలు పెట్టింది.