సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అమర్ ల్యాబ్ పరిశ్రమలో రసాయనాలు కలుపుతుండగా రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రియాక్టర్లో రసాయనాలు కార్మికులపై పడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న రమేష్, అశోక్ కుమార్ వర్మ, లగిత్ సింగ్, సోనూ కుమార్, ప్రేమ శంకర్, జైసింగ్ అనే ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు - తెలంగాణ క్రైం వార్తలు
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని అమర్ ల్యాబ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు కార్మికుల మీద పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు
రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు
వారిని కేపీహెచ్బీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమ పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న కూడా ఘటన గురించి తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. కార్మికుల ముఖం, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇదీ చూడండి :150 నుంచి 200 మంది వరకు గాయాలు
Last Updated : Mar 22, 2021, 10:40 PM IST