వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు వరంగల్-ఖమ్మం రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటో బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు - వర్ధన్నపేటలో ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు
వరంగల్ గ్రామీణ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వర్ధన్నపేట పట్టణ శివారు వరంగల్- ఖమ్మం రహదారిపై ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
![ఆటో బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10466660-thumbnail-3x2-accident-rk.jpg)
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాటిన అంబులెన్స్కు సమాచారం అందించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారంతా ఖమ్మం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి:గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య