పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్న వాహనాన్ని మంథని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీ నుంచి 18 బెల్లం కాటన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టబడిన బెల్లం మూడున్నర క్వింటాళ్లు ఉంటుందని చెప్పారు.
అక్రమంగా తరలిస్తున్నబెల్లం పట్టివేత - Seizure of jaggery smuggled in Manthani
ట్రాలీలో అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పెద్దపల్లి జిల్లా మంథని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడున్నర క్వింటాళ్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![అక్రమంగా తరలిస్తున్నబెల్లం పట్టివేత Seizure of jaggery smuggled in Manthani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11389522-179-11389522-1618318039509.jpg)
మంథనిలో అక్రమ బెల్లం పట్టివేత
గోదావరిఖని నుంచి మంథనివైపు కొందరు అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద కాపుకాసిన ఎక్సైజ్ పోలీసులు ఓ ట్రాలీని పట్టుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పశ్నించగా.. సదరు బెల్లం గోదావరిఖని చెందిన ఓ వ్యాపారిదని చెప్పాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:మాస్క్ ధరించని దుకాణదారులకు జరిమానా