కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం రోల్లపహాడ్లో నకిలీ విత్తనాలను (Counterfeit Seeds) నిల్వ ఉంచిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల విలువ సుమారు రూ. 64 వేలు ఉంటుందని ఎస్సై భవాని సేన్ తెలిపారు.
Seeds Seize: నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - నకిలీ విత్తనాలు పట్టివేత
కుమురం భీం జిల్లా రోల్లపహాడ్లో.. నకిలీ విత్తనాలు (Counterfeit Seeds) విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు. 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![Seeds Seize: నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత Fake cotton seeds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:46:36:1622715396-tg-adb-25-03-nakili-vithanala-pattivetha-av-ts10078-03062021152620-0306f-1622714180-749.jpg)
Fake cotton seeds
నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి, మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
ఇదీ చదవండి:Suicide: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య