తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి - తెలంగాణ నేర వార్తలు

సికింద్రాబాద్​​ అల్వాల్​ ఠాణా పరిధి హకీంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి

By

Published : Jan 22, 2021, 12:44 PM IST

ఎదురెదురుగా వచ్చిన లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటన సికింద్రాబాద్​ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హకీంపేట పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్​కోసం వస్తున్న బైక్​ను లారీ ఢీకొట్టింది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

శామీర్​పేట్​కు చెందిన సోమయ్య మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై అల్వాల్​ వైపు వస్తుండగా... పెట్రోల్​ కోసం బంకులోకి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో సోమయ్య ప్రమాద స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని అల్వాల్​లోని జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఆంధ్రాకు అక్రమ మద్యం.. పోలీసుల స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details