తెలంగాణ

telangana

ETV Bharat / crime

బస్సు సీట్ల కింద లగేజీ క్యారియర్​​.. ఓపెన్​ చేసి చూస్తే 2 కోట్ల నగదు - ప్రైవేట్ బస్సులో రూ.2కోట్ల నగదు స్వాధీనం

Money seized in private bus: టోల్​ ప్లాజా వద్ద తనిఖీల్లో భాగంగా ఓ ప్రైవేట్​ బస్సును చెక్​ చేసిన పోలీసులకు నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఓ లగేజీ క్యారియర్​లో రూ. 2 కోట్లు పోలీసుల కంటపడింది. కాగా ఆ నోట్లు అసలైనవా.. నకిలీవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Money seized in private bus
ప్రైవేట్ బస్సులో రూ.2 కోట్లు స్వాధీనం

By

Published : Apr 1, 2022, 12:18 PM IST

Money seized in private bus: ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ. 2 కోట్లు బయటపడ్డాయి. ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం-గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్‌లో తరలిస్తుండగా.. నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు నకిలీవా లేదా అసలా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:KTR Tweet Today: 'అది ఏప్రిల్ ఫూల్ జోక్ అయితే బాగుండేది'

ABOUT THE AUTHOR

...view details