తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2021, 10:46 AM IST

Updated : Aug 1, 2021, 10:58 AM IST

ETV Bharat / crime

LIVE VIDEO: కిరాణా దుకాణంలో చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని ఓ కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. 40 వేల రూపాయలతో పాటు 40 తులాల వెండి ఎత్తుకెళ్లారు.

robbery
దొంగతనం

లైవ్​ వీడియో: కిరాణా దుకాణంలో చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు

అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో జరిగింది. ఓ కిరాణా దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి రూ.40వేల నగదుతో పాటు దుకాణంలో ఉన్న సుమారు 40 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని భన్వర్ లాల్ తెలిపారు. పక్కనే ఉన్న జై భవాని జ్యూవెల్లరీ దుకాణంలో చోరీ చేసేందుకే గ్రిల్స్​ను గడ్డపారాలతో తొలగించేందుకు యత్నించగా విఫలం చెందారు. మొత్తం నలుగురు సభ్యుల ముఠా చోరీకి పాల్పడినట్లు సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనం జరిగిందిలా..

ముందుగా ఇద్దరు దుకాణం వద్దకు గునపాలతో వచ్చారు. తరువాత షట్టర్ తాళాలు పగలగొట్టారు. అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. ఇద్దరు బయట ఉండగా ఒకరు దుకాణంలోకి వెళ్లారు. లోపలికి వెళ్లిన వాడు దుకాణంలోని గల్లాపెట్టెను బయట ఉన్నవాడికి ఇచ్చాడు. తర్వాత వెండి వస్తువులు తీసుకెళ్లారు. వీరు చేసిదంతా సీసీటీవీలో రికార్డు అయింది. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు.. ముఖాలకు అడ్డుగా మాస్క్ కట్టుకున్నారు.

ఇదీ చదవండి:ఉత్తర్​ప్రదేశ్ టు హైదరాబాద్: ముఠా అరెస్ట్.. 330 తాబేళ్లు స్వాధీనం

Last Updated : Aug 1, 2021, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details