ఏపీలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్వాయిపాడు జాతీయ రహదారిపై ఆటోను... టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన ఆటో.. ముందు ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - పెళ్లకూరు లో రోడ్డు ప్రమాదం
ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెళ్లకూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఢీ కొట్టిన ఘటనలో.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
![నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి road-accindent-in-nellore-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11024662-51-11024662-1615860976554.jpg)
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ఉన్నారు. అందులో.. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
- ఇదీ చదవండి :భాజపా అభ్యర్థుల జాబితాపై కార్యకర్తల నిరసన
Last Updated : Mar 16, 2021, 8:41 AM IST