యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీని ఐరన్ లోడ్తో ఉన్న వాహనం ఢీకొట్టింది. ఐరన్ లోడ్తో ఉన్న లారీ డ్రైవర్ కృష్ణ (45) అక్కడికక్కడే మృతి చెందాడు.
వంగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి - road accident in bhuvanagiri district
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీని.. ఐరన్ లోడ్తో ఉన్న వాహనం ఢీకొట్టింది. ఐరన్ లోడ్తో ఉన్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వంగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి
ఇసుక లోడ్తో ఉన్న లారీ డ్రైవర్ రాజు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరణించిన వ్యక్తిని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:ఒకరి అజాగ్రత్త.. మరొకరి అతివేగం.. ఫలితం రోడ్డుప్రమాదం