ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్లలో కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందింది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో.. అర్ధరాత్రి ఒంటిగంట సమీపంలో సూర్యలంక సముద్ర స్నానానికి వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో బాపట్ల ఆదర్శనగర్ వద్దకు చేరుకోగానే.. వేగంగా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది.
ACCIDENT: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. విద్యార్థిని మృతి.. ఏడుగురికి గాయాలు - Siddhartha Engineering College students died in road accident
సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ మిత్రబృందానికి విషాద సంఘటన ఎదురైంది. మృత్యువు.. ప్రమాద రూపంలో ఎదుపై వారిలో ఒకరిని బలితీసుకుంది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. సమయానికి అక్కడే ఉన్న మత్స్యకారులు కారు అద్దాలు పగలగొట్టి వారందరినీ రక్షించారు. ఘటనలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న హైదరాబాద్కు చెందిన శ్రీనిధిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మరో ఏడుగురిని స్థానిక వైద్యశాలకు తరలించారు. నిహారిక , సాయి తులసి అనే ఇద్దరు విద్యార్థినుల తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో మత్స్యకారులు స్పందించకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:tragedy: మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య... కారణం అదేనా!