తెలంగాణ

telangana

ETV Bharat / crime

దూసుకొచ్చిన ట్యాంకర్​... నాలుగు వాహనాలు ధ్వంసం - తెలుగు తాజా వార్తలు

నడిరోడ్డుపై ఓ నీళ్ల ట్యాంకర్​ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్​ మైలార్​ దేవులపల్లి ఠాణా పరిధిలో జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

దూసుకొచ్చిన ట్యాంకర్​... నాలుగు వాహనాలు ధ్వంసం
దూసుకొచ్చిన ట్యాంకర్​... నాలుగు వాహనాలు ధ్వంసం

By

Published : Jan 19, 2021, 10:03 PM IST

రంగారెడ్డి జిల్లా​ రాజేంద్రనగర్​ మైలార్​ దేవులపల్లి ఠాణా పరిధిలో ఓ నీళ్ల ట్యాంకర్​ బీభత్సం సృష్టించింది. మహఫిల్​ హోటల్​ ముందు నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

వాహనం బ్రేకులు పనిచేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:సీఐ ఫేస్​బుక్ హ్యాక్ చేసిన సైబర్​ నేరగాళ్లు

ABOUT THE AUTHOR

...view details