తెలంగాణ

telangana

ETV Bharat / crime

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు దుర్మరణం - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

Road Accident in Srikakulam District: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధి హామీ కూలీలపైకి ఓ లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Road accident in srikakulam district
Road accident in srikakulam district

By

Published : Feb 4, 2023, 7:51 PM IST

Road Accident in Srikakulam District: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధి హామీ కూలీలపైకి ఓ లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతి చెందినవారు మందాడ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details