తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2021, 1:43 PM IST

ETV Bharat / crime

తుపాకీ మిస్​ఫైర్: హోంగార్డు భార్య మృతి.. వెలుగులోకి కొత్తకోణం

ఏపీలోని విజయవాడలో తుపాకీ మిస్ ఫైర్ ఓ హోంగార్డు భార్య ప్రాణాన్ని బలిగొంది. అయితే పోలీసులు విచారణలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో భార్యను రివాల్వర్​తో కాల్చినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

revolver-misfired-at-vijayawada-home-guard-house-wife-died
వెలుగులోకి కొత్తకోణం

అసలేం జరిగింది??

తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో గొల్లపూడిలో జరిగింది. మౌలానగర్‌లో నివాసం ఉంటున్న హోంగార్డు వినోద్‌కుమార్‌.. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ వద్ద అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఏఎస్పీ శశిభూషణ్ క్యాంప్​కు అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకి హోంగార్డు వినోద్ వద్ద ఉంది.

ఆదివారం రాత్రి భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ జరిగి.. తుపాకీ గుండు వినోద్ భార్య సూర్యరత్న ప్రభ గుండెలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై స్పందించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హోంగార్డుని భవానీపురం పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

కేసులో కొత్తకోణం..

క్షణికావేశంలో భార్యను బెదిరించే క్రమంలోనే తుపాకితో కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. గత అర్ధరాత్రి బంగారు నగలు తాకట్టు పెట్టిన విషయంలో భార్యతో గొడవ జరిగినట్లు పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు మీడియాకు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

వెలుగులోకి కొత్తకోణం

ఇదీ చదవండి:భార్యను హతమార్చిన భర్త.. విచారణలో షాకింగ్ విషయాలు!

ABOUT THE AUTHOR

...view details