యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన ఓ యువతి, చౌటుప్పల్ మండాలనికి చెందిన యువకుడితో పెద్దల సమక్షంలో పెళ్లి సంబంధం కుదిర్చారు. కొన్ని కారణాలతో ఆ పెళ్లి సంబంధం రద్దైంది. తర్వాత ప్రేమించుకున్న యువతీ, యువకుడు ఆర్యసమాజ్లో వివాహం చేసుకుని చౌటుప్పల్ పీఎస్ను ఆశ్రయించారు. అంతకు ముందే తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు భువనగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నూతన వధూవరులను భువనగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కి బుధవారం పిలిపించారు. ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
పెళ్లి.. ఇంతలోనే సినీఫక్కీలో వధువు కిడ్నాప్!
పెద్దలు కుదిర్చిన సంబంధం.. ఇరువర్గాల మధ్య వివిధ కారణాలతో విభేదాల వల్ల పెళ్లి కుదరలేదు. యువతీ యువకులు మాత్రం తరచూ ఫోన్లో మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. బంధువుల సహాయంతో హైదరాబాద్ సైదాబాద్లోని ఆర్యసమాజ్లో గత నెల 30న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వధువును ఆమె తల్లిదండ్రులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి.. ఇంతలోనే సినీఫక్కీలో వధువు కిడ్నాప్!
వధూవరులు ఇద్దరూ మేజర్లు కావటం వల్ల యువకుడికి, వధువును అప్పగించి స్వగ్రామానికి పోలీసుల బందోబస్తుతో పంపించారు. మార్గమధ్యలో భువనగిరి మండలం నందనం గ్రామంలో వరుడి కారును, వధువు తరుఫు బంధువులు అడ్డగించి దాడికి పాల్పడి.. వధువును తీసుకెళ్లారు. యాదగిరిగుట్ట, ఆత్మకూరులో తిరిగి రాయగిరి వైపు వస్తుండగా వీరవెల్లి వద్ద నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్కి పంపినట్లు భువనగిరి గ్రామీణ ఎస్ఐ సైదులు తెలిపారు. వధువును, వరుడికి అప్పగించినట్లు చెప్పారు.