గణతంత్ర దినోత్సవం రోజునా కొందరు మద్యాన్ని విక్రయించారు. వీరిపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది.
రూ.2 లక్షల మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
బెల్ట్ షాప్లపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![రూ.2 లక్షల మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు Excise Police raided belt shops selling liquor illegally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10390130-1107-10390130-1611670579154.jpg)
బెల్ట్ షాప్లపై దాడి.. రూ. 2 లక్షల విలువైన మద్యం స్వాధీనం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. ఆ బెల్ట్ షాప్లపై ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:కనకరాజు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు: మంత్రులు