పెట్రోల్ బంకులకు ఆయిల్ తరలించే ట్యాంకర్ల నుంచి డీజిల్ దొంగలిస్తున్న మూఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 9 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల పోలీసులు తెలిపారు.
పెట్రోల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ చోరీ.. 9మంది అరెస్టు - Diesel theft from petrol tankers
బంకులకు ఆయిల్ సరఫరా చేసే వాహనాల నుంచి డీజిల్ను దొంగలిస్తున్న ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 3 లారీలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ చోరీ.. 9మంది అరెస్టు
ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో... పెట్రోల్ పంపులకు తరలించే ట్యాంకర్ల నుంచి డీజిల్ తీసి కిరోసిన్ కలుపుతుండగా ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. వీరి నుంచి రూ.38,750 వేలు, 3 లారీలు, ఒక ద్విచక్ర వాహనం, 60 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:వ్యక్తి సజీవదహనం.. ప్రమాదమా లేక హత్యా ..?