హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న విదేశీ ముఠాను రాచకొండ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. నకిలీ ఫేస్బుక్ ఐడీలు క్రియట్ చేసి అందమైన యువతుల ఫొటోలను అమాయక యువకులకు పంపించి.. వారి అకౌంట్ వివరాలను సేకరించి వారి నగదును దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న విదేశీ ముఠా అరెస్టు - cyber crimes in rachakonda commissionarate
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులున్న విదేశీ ముఠాను రాచకొండ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
సైబర్ క్రైమ్, సైబర్ క్రిమినల్స్, సైబర్ నేరాలు, రాచకొండ సీపీ
ఈ ముఠాలో ఐదుగురు సభ్యులున్నట్లు వెల్లడించారు. వారి నుంచి యురోపియన్ కరెన్సీ, బంగారం, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ముఠాను నగరంలోని చంచల్ గూడ జైలుకు తరలించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
- ఇదీ చదవండి :నీటిలో మృతదేహాలు.. వైరస్ సంక్రమిస్తుందా?