తెలంగాణ

telangana

ETV Bharat / crime

వీడిన చేర్యాల జడ్పీటీసీ మర్డర్​ కేసు మిస్టరీ.. పోలీసుల అదుపులో నిందితులు

Cheryala ZPTC Murder Case Update : సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. మొదట హత్యగా ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చిన పోలీసులు.. వేగంగా స్పందించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో 24 గంటల్లో కేసును ఛేదించారు. నిందితులను ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

By

Published : Dec 27, 2022, 8:53 AM IST

Mallesham murder case
Mallesham murder case

Cheryala ZPTC Murder Case Update : సంచలనంగా మారిన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం మృతిని.. పోలీసులు హత్యగా తేల్చారు. మొదట రోడ్డు ప్రమాదం అని భావించినప్పటికీ.. శరీరంపై గాయాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. హత్యే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చిన పోలీసులు వేగంగా స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. హంతకులను పట్టుకునేందుకు హుస్నాబాద్ ఏసీపీ సతీశ్​ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

దర్యాప్తు ప్రారంభించిన ఈ బృందం అనుమానితులపై దృష్టి సారించింది. మల్లేశం స్వగ్రామం గురిజకుంట ఉప సర్పంచ్ సత్యనారాయణతో గత కొంతకాలంగా వివాదాలు నెలకొన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిని, అతని ముఖ్య అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించగా.. నేరం అంగీకరించడంతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దాచిన వివరాలు సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది.

నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు వంటి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లేశం మృతదేహానికి శవపరీక్షలు పూర్తి చేసి స్వగ్రామం గురిజకుంటకు తరలించారు. ఇవాళ గురిజకుంటలో మల్లేశం అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు నిందితులను పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details