తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2021, 2:16 PM IST

ETV Bharat / crime

రూ. 29 లక్షల విలువైన గంజాయి పట్టివేత

భద్రాచలంలో భారీగా నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్​ చెక్​పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. 198 కిలోల గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Marijuana seized in bhadrachalam
భద్రాచలంలో గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తోన్న 198 కిలోల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఫారెస్ట్​ చెక్​పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 29,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒడిశా సరిహద్దు నుంచి పుణెకు గంజాయిని తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది.

ఇదీ చదవండి:అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. కుటుంబీకుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details